ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా.. 4098 మంది మృతి

ఆదివారం, 7 జూన్ 2020 (14:52 IST)
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 122207 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 69,62,528కి చేరాయి. అలాగే శనివారం 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 401544కి చేరింది. అలాగే దాదాపు 34.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక అమెరికాలో కొత్తగా 21975 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,87,683కి చేరాయి. అలాగే శనివారం 687 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 112077కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
 
అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా భారత్‌లో 9887 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 236657కి చేరింది. అలాగే 20 గంటల్లో 294 మంది చనిపోయారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు