బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళుతున్న నారాయణ మూర్తి అల్లుడు

గురువారం, 14 జులై 2022 (12:05 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఇన్ఫోసిస్ మాజీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దూసుకెళుతున్నారు. ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఇపుడు  ఆ దేశ కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. 
 
ఇందుకోసం చేపట్టిన ఓటింగ్ ప్రక్రియలో తొలి దశలో రిషికే బ్రిటన్ సెనెటర్లు పట్టం కట్టారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన వారికి ప్రధాని కుర్చీని అప్పగిస్తారు. అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇద్దరు అభ్యర్థులు ఈ రేస్ నుంచి వైదొలిగారు. 
 
ఈ పోటీలో రుషి సునాక్‌కు గట్టి పోటీని ఇచ్చేవారిలో మోర్డాంట్‌, ప్రస్తుత ఆర్థిక మంతమ్రి నదిమ్ జహవిలు ఉన్నారు. జెరెమీ హంట్‌లు రేస్ నుంచి వైదొలిగారు. దీంతో ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో రిషి సునక్‌కు అత్యధిక ఓట్లు రావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు