యూఏఈ వెళ్లాలనుకుంటున్నారా? ఐతే బంపర్ ఆఫర్ ఇదో..?!

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (22:33 IST)
యూఏఈలో పనిచేయాలనుకునేవారికి వీసాలు చాలా స్వల్ప సంఖ్యలోనే అందిస్తుంటుంది అక్కడి ప్రభుత్వం. అది కూడా అతడు పనిచేయబోతున్న సంస్థ యాజమాన్యం స్పాన్సర్ చేస్తేనే ఆ వీసా కూడా ఉద్యోగికి లభిస్తుంది. దీంతో అక్కడ నివాసం ఉండాలనుకునేవారు నానా అవస్థలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో  విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
ఇకపై తమ దేశంలో పనిచేయాలనుకునేవారు ఉద్యోగం చేయాబోతున్న కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు వీసా నిబంధనలను సడలించినట్లు సోమవారం ప్రకటించింది. కోవిడ్ వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేందుకే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా 'గ్రీన్ వీసా' అనే కొత్త రకం వీసాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
 
తాజాగా ప్రకటించిన గ్రీన్ వీసా ద్వారా కంపెనీల స్పాన్సర్‌షిప్ లేకుండానే యూఏఈకి వెళ్ళేందుకు విదేశీ ఉద్యోగులకు అనుమతి లభించనుంది. అంతేకాకుండా ఈ వీసాతో తమ తల్లిదండ్రులకు కూడా దాదాపు 25ఏళ్ల వరకు వీసా పొందేందుకు అవకాశం లభించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు