ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన సుశీ చేప తింది.. అంతే కడుపులో వేలాది పరాన్న జీవులు..?!

బుధవారం, 9 డిశెంబరు 2020 (12:09 IST)
sushi fish
ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని తీసుకున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల జేసి అనే మహిళ తొమ్మిది నెలల కిందట ఫ్రిజ్లో నిల్వ ఉంచిన సుశీ చేప అనే వంటకాన్ని తిన్నదట. అయితే ఆమె దాన్ని కొనుగోలు చేసి సుమారు ఐదు రోజులు అవుతుంది. అప్పటినుంచి అది ఫ్రిడ్జ్‌లోనే ఉంది. అది తిన్న నాలుగు నెలల తర్వాత ఆమె కడుపులో ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. 
 
ఆస్పత్రికి వెళ్లకుండా వుండిపోయింది. కానీ కడుపులో ఏదో చేప ఈదుతున్నట్లుగా ఉన్నట్లుగా ఉందని ఆమె తెలిపేది. అప్పటి నుంచి ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ఆస్పత్రికి వెళ్లకుండా మందులు తీసుకునేది. కానీ ఫలితం లేకపోయింది. ఒకరోజు రాత్రి ఆమె కాళ్లు చేతులు కదల్లేదు. పదే పదే మూర్ఛ వచ్చి పడిపోయేది దీంతో భర్త జేసీని హాస్పటల్లో చేర్చాడు.
 
ఆమెకు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు నిర్వహించగా వేలాది ఏలిక పాముల గుడ్లు ఆమె కడుపులో కనిపించాయి. అంతేగాకకు టేప్ వార్మ్ చెందిన కొన్ని భాగాలను కూడా ఆ నమూనాలో గుర్తించారు. దీంతో ఆమె కడుపులో టేప్ వార్మ్ పెరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు గుర్తించారు. 
 
ఇవి కడుపులో కనీసం 9 మీటర్ల పొడవు పెరుగుతాయని వాటి వల్ల ఆమె కడుపులో ఏదో కదులుతున్న అనుభవం కలిగి ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె నరాల కణాల్లో రక్తాన్ని అది బ్లాక్ అయినట్లు తెలుసుకున్నారు. ఆపై చికిత్స చేశారు. అందుకే ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు