చైనాలో విజృంభిస్తున్న కరోనా.. వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (13:31 IST)
చైనాలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తంది. ఈ వైరస్ ధాటికి ఏకంగా ఆస్పత్రి డైరెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
చైనాలోని వూహాన్ నగరం కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నగరంలోని వుహాన్ ఆసుపత్రి డైరెక్టర్‌గా లియు జిమింగ్ ఉన్నారు. ఈయనకు వైరస్ బారినపడి మంగళవారం కన్నుమూశారు. ఇలా ఒక ఆసుపత్రి డైరెక్టరే ఈ వ్యాధిగ్రస్తుడై మృతి చెందడం ఇదే మొదటిసారి. 
 
మరో ఆరుగురు మెడికల్ వర్కర్లు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా లియు మృతికి సంబంధించిన వార్తలు మంగళవారం అర్ధరాత్రి సర్క్యులేట్ కాగా ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. వాటి స్థానే.. డాక్టర్లు ఆయనకు ఇంకా చికిత్స చేస్తున్నారనే సమాచారంతో వాటిని భర్తీ చేశారు. 
 
అయితే చివరకు ఆయన మరణాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ గురించి మొదట వెలుగులోకి తెచ్చిన నేత్ర వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను అధికారులు గత డిసెంబరులో శిక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మరణించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు