తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఆంధ్రప్రదేశ్కు రప్పించారు. ఇదేవిధంగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ సంస్థ తన తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్లో ఉన్న చంద్రబాబు నాయుడు తాజాగా టెక్ దిగ్గజం యాపిల్పై దృష్టి సారించారు.
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఐటీ కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న మేథాటవర్స్లో ఏడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీల్లో స్పెయిన్కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి.