2021 ఫిబ్రవరిలోపు భారత్‌లోకి పబ్ జీ.. కానీ ఆ ఫేక్ డౌన్‌లోడ్ లింక్స్ క్లిక్ చేస్తే..?

మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:55 IST)
పబ్ జీపై నిషేధం విధించిన తర్వాత.. అరెరె అంటూ కుంగిపోయిన పబ్ జీ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పబ్​జీ సహా 118 చైనీస్ యాప్స్​ను భారత ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్​లో బ్యాన్ చేసింది. భారత సమగ్రతకు, భద్రతకు ఈ యాప్స్ ముప్పుగా ఉన్నాయని, డేటాను చోరీ చేస్తున్నాయని పేర్కొంది. కాగా మళ్లీ గేమ్​ను భారత్​‌లో మళ్లీ లాంచ్ చేసేందుకు పబ్​జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తూనే ఉంది.
 
ఈ క్రమంలో భారత్​లో గేమ్​ను లాంచ్ చేస్తామని పబ్​జీ ఇటీవల ప్రకటించింది. అయితే గేమర్లు మాత్రం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే. 2021 ఫిబ్రవరిలోపే భారత్​లో పబ్​జీ వచ్చే అవకాశం ఉంది. అయితే పబ్​జీ అంటూ కొన్ని సైట్లలో లింక్ కనిపిస్తున్నాయి. ఏపీకే ఫైల్స్​ కు లింక్​ లు ఉంటున్నాయి. అయితే అవన్నీ నకిలీవే.
 
పబ్​జీ అని ఉన్న ఫేక్ లింక్​లకు క్లిక్ చేయడం ప్రమాదకరం. దీనివల్ల మొబైళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని వెబ్​సైట్లలో లభిస్తున్న థర్డ్​ పార్టీ ఏపీకే ఫైల్స్​ను కొందరు డౌన్​లోడ్ చేసుకుంటున్నారు. ఇవి జెన్యూన్ ఫైల్స్ కావు. దీన్ని వల్ల ఫోన్​లోకి మాల్​వేర్ వచ్చి.. తెలియకుండా డేటా చోరీకి గురవుతుంది. కాబట్టి పబ్ జీ డౌన్లోడ్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
 
గేమ్ వచ్చేసిందంటూ పుకార్లు పెరిగిపోతుండడంతో పబ్​జీ కార్పొరేషన్​ స్పందించింది. యూజర్లు ఇంకొంత కాలం వేచిచూడాలని సూచించింది. స్థానిక నిబంధనల ప్రకారం ప్లేయర్లు డేటా సురక్షితంగా, భద్రంగా ఉండేలా గేమ్​ను తీసుకొస్తున్నామని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు