తాత్పర్యం : అన్ని విషయాలు తెలిసిన వాడైనప్పటికీ, తేలు నిప్పుల్లో పడినపుడు బాధతో దాన్ని రక్షించే ప్రయత్నం చేసినట్లైతే... అది మేలు చేయడం మాట అటుంచి కీడే చేస్తుంది. అలాగే చెడ్డవాడికి ఆపద కలిగినప్పుడు మనం బాధపడి, సహాయం చేసినప్పటికీ అతడు కీడే చేస్తాడు గానీ మేలు చేయడని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, దుష్టులకు దూరంగా ఉండమని ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతకకారుడు.