గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్టు తెలుస్తోంది. లండన్లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ఈ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ విమానంలో విజయం రూపానీ పేరుతో ఓ టికెట్ తొలుత నెట్టింట వైరల్ అయింది. ఇందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆ తర్వాత విమానం ఎక్కినట్టు నిర్ధారించే ప్రయాణికుల జాబితాలోనూ రూపానీ కనిపించింది. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.