ఓం ప్రకాష్ బెంగుళూరు నివాసంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయంటూ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడు ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓ ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతిగల కారణం తెలుస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.