'అస్త్ర' క్షిపణిని పరీక్షించనున్న భారత్

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:09 IST)
Astra missile
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల 'అస్త్ర' క్షిపణిని భారత్‌ మరోసారి పరీక్షించనుంది. వైమానిక పోరాటంలో సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్‌లపై ఆధిపత్యం ప్రదర్శించే దిశగా రూపొందించిన 'అస్త్ర' మార్క్‌ 2 మిసైల్‌ను భారత్‌ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్షిపణి 160 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
 
అధునాతన అస్త్ర మార్క్‌ 2 గగనతల పోరాటంలో యుద్ధ విమానాలకు మరింత శక్తినిస్తుంది. తర్వాతి తరం క్షిపణి 'అస్త్ర' మార్క్‌ 2 వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని మాజీ సెంట్రల్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీపీ సిన్హా(రిటైర్డ్‌) తెలిపారు. 
 
భారత వైమానిక దళం, నావికాదళం ఇప్పటికే 288 అస్త్ర మార్క్ -1 క్షిపణుల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రష్యాకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి ఈ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు