ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ ప‌రీక్ష

శనివారం, 16 జనవరి 2021 (18:47 IST)
నీట్ పీజీ -2021 ప‌రీక్ష తేదీలు ఖ‌రారయ్యాయి. ఈ మేర‌కు నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ నీట్ పీజీ ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించింది.

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ఈ  పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి వుండాలి. 

ఇత‌ర వివ‌రాల కోసం nbe.edu.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు