రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర రహస్య పత్రాలు స్వీకరిస్తూ అక్టోబరు 26న అరెస్టయిన పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి మహమూద్ వద్ద జరిపిన విచారణలో ఫర్హాత్ బండారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు చౌదరి మునాబర్ సలీం దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న ఫర్హాత్ తన ఏజెంట్లలో ఒకరని వెల్లడించాడు.