పబ్‌జీ వ్యసనం.. రైలు వస్తున్నా పట్టించుకోలేదు.. వేగంగా వచ్చిన రైలు..?

మంగళవారం, 19 మార్చి 2019 (15:19 IST)
పబ్‌జీ వ్యసనంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హింగోలిలోని ఖట్‌కలి బైపాస్‌ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నగేశ్‌ గోరి(24), స్వప్నిల్ అన్నపూర్ణె (22) అనే యువకులు హింగోలికి సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్ద పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. గేమ్ మాయలో పడి చుట్టు ప్రక్కల జరుగుతున్నవి గమనించలేదు. 
 
రైలు వస్తున్న విషయం కూడా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో అటు నుండి వేగంగా వస్తున్న హైదరాబాద్‌- అజ్మేర్‌ రైలు వీరిని ఢీకొట్టింది. యువకులు ఇద్దరూ అక్కడికక్కకే మరణించారు. కొన్ని గంటల తర్వాత స్థానికులు మృత దేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యం పొందిన పబ్జీ గేమ్ వల్ల అనేక మంది పిల్లల ప్రవర్తన మారిపోతోందని, చివరికి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయని, దానిని వెంటనే నిషేధించాలని కొంత మంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు