అయితే, ఆస్పత్రి వద్ద ఆయనకు నిరాశే ఎదురైంది. అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్కు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లినా, ఆయన్ను జయలలిత వద్దకు తీసుకువెళ్లేందుకు అధికారులు అంగీకరించలేదు. ఆమెను చూసేందుకు వీల్లేదని స్పష్టం చేయడంతో, ఆమె ఆరోగ్యం, ఏమైందని మాత్రమే రాహుల్ అడిగి తెలుసుకుని బయటకు వచ్చారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... జయలలిత కోలుకుంటున్నారనీ, ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. కాగా, ఆమెకు సుదీర్ఘకాలం పాటు చికిత్స అవసరమని, అది ఎన్నాళ్లన్నది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు రాహుల్కు చెప్పినట్టు సమాచారం.