బాలికపై 8 మంది టీచర్ల గ్యాంగ్ రేప్: వీడియో తీశారు.. గర్భం దాల్చకుండా మందులు కూడా?

శనివారం, 25 మార్చి 2017 (18:18 IST)
చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన కుమార్తెపై ఎనిమిది మంది టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారని.. దాన్ని వీడియో కూడా తీశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్‌లో 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేన్సర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న తన కుమార్తెపై దారుణానికి పాల్పడడమే కాకుండా గర్భం దాల్చకుండా మందులు కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

కేసును విచారించేందుకు ప్రభుత్వం మహిళా ప్యానెల్‌ను నియమించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి