UP: రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని యువకుడు మృతి

సెల్వి

శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (16:59 IST)
ప్రస్తుతం జనం రీల్స్ పిచ్చి పట్టి తిరుగుతున్నారు. ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. ప్రాణాలు ప్రమాదంలో పెట్టైనా రీల్స్ తీస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ తీస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని.. యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఖతౌలి రైల్వే స్టేషన్‌ పరిధిలో మరో రీల్స్‌పిచ్చితో ప్రమాదం జరిగింది. సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు