మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి సహజీవనం చేస్తున్న మహిళపై కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ మహిళతో పాటు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తాత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలించారు. 
 
యూపీలోని కాన్పూర్‌‌కు చెందిన రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుుడ విమల్ (63)లు కలిసి ఉంటున్నారు. వారిద్దరి కుమారులు లలిత్, అక్షిత్‌లు వేరుగా ఉంటున్నారు. అయితే, 30 యేల్ల కుష్బూ అనే మహిళతో విమల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన కుమారుుడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. 
 
ఈ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో తాత రాంప్రకాకశ్, తండ్రి విమల్, ఖుష్బూపై కుమారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూలు ప్రాణాలు కోల్పోయారు. విమల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు