నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్

బుధవారం, 15 నవంబరు 2017 (12:12 IST)
నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఏఎస్ఐను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 
 
దక్షిణ అలహాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన నందగోపాల్ అలియాస్ నందు ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిశాక స్థానిక నేత ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన.. కార్యకర్తలతో కాళ్లు మసాజ్ చేయించుకున్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది జరుగుతున్న సమయంలో ఉత్తర అలహాబాద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్ పాయ్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడండి. 
 
 

#WATCH: Uttar Pradesh Cabinet Minister Nand Gopal 'Nandi' gets foot massage by BJP workers after local body polls campaigning, in Allahabad pic.twitter.com/iQZsm4L6if

— ANI UP (@ANINewsUP) November 14, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు