గొల్లపూడికి వెంకయ్య పరామర్శ

మంగళవారం, 5 నవంబరు 2019 (18:50 IST)
చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుని పరామర్శించారు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడిని వెంకయ్య వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుమారులతో ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గొల్లపూడి మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు