కేరళలో మూడోవేవ్‌కి సంకేతమా.. 24 గంటల్లో 30వేల కేసులు

గురువారం, 26 ఆగస్టు 2021 (22:13 IST)
కేరళలో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు.. మూడోవేవ్‌కి సంకేతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 30 వేలకు పైగా నమోదై.. 30 శాతం మేర కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో కేరళలో నమోదైన కేసులు మూడో వేవ్‌కి వార్నింగ్‌ బెల్స్‌ మోగించాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్‌ చివరి నాటికి థర్డ్‌వేవ్‌ ఉధృతం కావచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. 
 
మరోవైపు కోవిడ్‌ అంచనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ బుధవారం భారత్‌లో మునుపటి కంటే కరోనా వ్యాప్తి రేటు తక్కువగా ఉందని చెప్పారు. 
 
భారత్‌లో కోవిడ్‌ ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఉపశమనం కలిగించేలా ఉన్నా.. నిపుణులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు