సహజీవనం చేసిన ప్రియుడు వదిలేశాడని.. అతని కుమారుడిని చంపేసిన ప్రియురాలు

బుధవారం, 16 ఆగస్టు 2023 (11:54 IST)
తన కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత వదిలివేసిన ప్రియుడి కుమారుడిని ప్రియురాలు చంపేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. 2019 నుంచి సహజీవనం చేస్తూ వచ్చిన ఓ వ్యక్తి మూడేళ్ల తర్వాత తన భార్య, కుమారుడి వద్దకు వెళ్లిపోయాడు. దీన్ని జీర్ణించుకోలేని మహిళ... 11 యేళ్ల కుమారుడిని హత్య చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పూజా కుమారి అనే 24 యేళ్ల యువతి జితేందర్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. 2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరంతా ఢిల్లీలోని ఇంద్రపురిలో ఉంటున్నారు. అయితే, మూడేళ్ల తర్వాత ఆయన పూజను వదిలేసి తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ఆమె తన ప్రియుడిని కుమారుడిని చంపేశాడు. జితేంద్రం ఇంటి అడ్రస్ కావాలని తమ కామన్ ఫ్రెండ్‌ను ఈ నెల 10వ తేదీన అడిగింది. తన ప్రియుడి చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. 
 
జితేందర్ కొడుకు బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అపుడు ఇంట్లో ఎవరూ లేరు. ఇదేఅదనుగా భావించిన ఆమె అబ్బాయి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బట్టలతో పాటు అబ్బాయి మృతదేహాన్ని ఒక బాక్సులో పెట్టి తీసుకొచ్చింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహకారంతో ఓ మహిళ వెళ్లినట్టు గుర్తించరు. ఆ తర్వాత ఇంద్రపురిలోని పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 
 
ఆమె ఆ ప్రాంతంలోని ఉందని, అయితే తాను ఉండే ప్రదేశాలను మారుస్తోందని పోలీసుల ఒక నిర్దారణకు వచ్చారు. ఆమె గురించి ఎంత మందిని ప్రశ్నించినా వారికి ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులను వదిలేసి చాలాకాలం అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరకు మూడు రోజుల తర్వాత ఆమెను పోలీసుల అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జితేందర్ ఆమె తనను పెళ్లి చేసుకోవాలనుకుందని, పెళ్లికి తన కుమారుడు అడ్డంకిగా మారాడని భావించేందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు