రాజ్యాంగ రూప కల్పన: అమెరికా నుంచి ఆ మూడు తీసుకున్నారు..

సోమవారం, 22 జనవరి 2018 (14:24 IST)
స్వాతంత్ర్య భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజునే గణతంత్ర వేడుకగా జరుపుకుంటున్నాం. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ.. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది.

ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించడం జరిగింది. ఈ రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. మన భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినా.. ఇతర రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను గ్రహించారు. 
 
వాటిలో ముఖ్యమైనవి.. 
ప్రాథమిక హక్కులు  — అమెరికా
సుప్రీం కోర్టు  —  అమెరికా
న్యాయ సమీక్షాధికారం  —  అమెరికా
భారతదేశంలో ప్రాథమిక విధులు  —  రష్యా
కేంద్ర రాష్ట్ర సంబంధాలు  —  కెనడా
అత్యవసర పరిస్థితి  —  వైమర్(జర్మనీ)
ఏక పౌరసత్వం   —  బ్రిటన్
పార్లమెంటరీ విధానం — బ్రిటన్
స్పీకర్ పదవి  —  బ్రిటన్
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు  —  ఐర్లాండ్
రాష్ట్రపతి ఎన్నిక పద్దతి  —  ఐర్లాండ్
రాజ్యసభ సభ్యుల నియామకం  —  ఐర్లాండ్
 
ఇలా ఇతర దేశాల నుంచి.. ఇతర గ్రంథాల నుంచి పరిశోధనలు చేసుకున్నాక భారత పరిపాలనా మార్గదర్శ గ్రంథం ఆమోదం పొందింది. ఇలా ఆమోదం పొందిన మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు