హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ షాకింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ అయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తనను వేశ్యలాగా చూశారని మాగీ ఆరోపించారు. నిర్వాహకులు తన వాదనలను తోసిపుచ్చినప్పటికీ, ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యింది.