విషాహారం తిని 35 జింకలు మృత్యువాత పడ్డ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం, గుమ్మడం గ్రామంలో పొలంలో జల్లి ఉంచిన క్రిమిసంహారకాలతో కూడిన విషపూరిత మొక్కజొన్నలను మేతకై వచ్చిన 30 జింకలు తిని మరణించాయి. మొక్క జొన్నలు తిన్నఅనంతరం కొంత దూరం వెళ్లాక అవి మరణించాయని గ్రామస్థులు అన్నారు.