శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

సెల్వి

శుక్రవారం, 31 మే 2024 (18:40 IST)
Dimple Hayathi
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని డింపుల్ హయాతి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
ఇక స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చిన డింపుల్‌తో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. కానీ వేసవి ఎండలకు డింపుల్ హయాతి కాళ్లు మంటకు తట్టుకోలేక వారిని వద్దని వారించింది. 
 
ఎండ ధాటికి ఆలయం వెలుపల వుండే స్థలంలో డింపుల్ నడవలేకపోయింది. డింపుల్ హయాతి తిరుమల శ్రీవారి దర్శనం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

తిరుమల శ్రీవారి సేవలో డింపుల్ హయాతి సందడి..@hayathidimple @TTDevasthanams #tirumaladarshan #RTV pic.twitter.com/99T7pGZjqy

— RTV (@RTVnewsnetwork) May 31, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు