రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఠాగూర్

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (13:24 IST)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం "పెద్ది". ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లపై మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఆ చిత్రం బృందం మరో ఆసక్తికరమైన వార్తను వెల్లడించింది. 
 
ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌ రూ.35 కోట్లకు దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా, రెహ్మాన్ - చరణ్ కాంబినేషన్‌లో ఇదే తొలి మూవీ కావడం గమనార్హం. 
 
ఇక చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనికోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ చిత్రంలో చెర్రీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు