పవన్ కళ్యాణ్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ (video)

మంగళవారం, 9 జూన్ 2020 (17:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత తన 26వ చిత్రం వకీల్ సాబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని షూటింగ్ జరుగుతుండగానే తదుపరి చిత్రం క్రిష్‌తో ఉండబోతోంది. క్రిష్ దానికి సంబంధించిన స్క్రిప్ట్, సెట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు. వకీల్ సాబ్ సినిమాని డైరెక్టర్ వేణు శ్రీరామ్ హిందీ పింక్ నుండి రీమేక్ చేస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఇది.
 
పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా 'విరూపాక్ష'ను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏయం రత్నం నిర్మిస్తుండగా, సినిమా కథ మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. సినిమా అంతా కోహినూర్ వజ్రానికి సంబంధించిన కథ చుట్టూ నడుస్తుందని ఇదివరకే తెలిపారు.
 
పీరియాడిక్ సినిమా కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఏర్పాటు చేసి ఆ కాలం నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. పవన్‌కి మొదటి హిస్టారికల్ సినిమా అయిన దీని షూటింగ్ విషయానికి వస్తే జులై సెకండ్ వీక్ నుండి ప్రారంభం కానుందని వార్తలు వినిపించాయి. కానీ షూటింగ్ ఆగష్టు నెల సెకండ్ వీక్ నుండి ప్రారంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది ముగిసే లోపు షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు