త్రివిక్రమ్ కుమారుడి ఫోటో వైరల్.. డైరక్టర్ కాబోతున్నాడట!

శనివారం, 21 అక్టోబరు 2023 (23:42 IST)
Trivikram Son
త్రివిక్రమ్ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ తనయుడు దర్శకుడు కాబోతున్నాడు. రిషికి దర్శకత్వం అంటే ఇష్టమని తల్లి సౌజన్య చెప్పారు. దర్శకులందరిలో త్రివిక్రమ్‌ది ప్రత్యేకమైన శైలిగా గుర్తింపు వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌కు అనుబంధంగా ఏర్పడిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి సినిమాలు నిర్మించడానికి తన భార్య సాయి సౌజన్యను త్రివిక్రమ్ రంగంలోకి దించారు. 
 
ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి సౌజన్య.. కుమారుడు రిషి మనోజ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్ కుమారుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సాయి సౌజన్య ఇటీవల ఖరారు చేశారు. 
 
రిషికి దర్శకత్వం అంటే ఆసక్తి ఉందని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలో ప్రస్తుతం రిషి తెలుసుకుంటున్నాడని ఆమె వెల్లడించారు. 
 
ప్రస్తుతం రిషి మనోజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు