Manoj Kumar, Ashitha Reddy, Srinivas,Ramanamurthy Tangellapalli
మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "నిశ్శబ్ద". ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "నిశ్శబ్ద" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు.