వివరాల్లోకి వెళితే.. హాపుర్కు చెందిన 35 ఏళ్ల సచిన్ను అతని కుటుంబ సభ్యులు ఘజియాబాద్లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అయితే, తనను అక్కడ వదిలి వెళ్లడం, సెంటర్లో సరైన ఆహారం పెట్టకపోవడంతో సచిన్ తీవ్రమైన కోపానికి గురయ్యాడు.
ఆకలికి సరిగ్గా అన్నం పెట్టకపోవడంతో వంటగదిలోని స్టీల్ స్పూన్లను దొంగిలించి, బాత్రూమ్లోకి తీసుకెళ్లేవాడు. వాటిని ముక్కలుగా విరిచి, నోట్లో పెట్టుకుని నీళ్ల సహాయంతో గొంతులోకి తోసేసుకునేవాడు. ఇలా స్పూన్లతో పాటు టూత్బ్రష్లు, పెన్నులను కూడా మింగడం ప్రారంభించాడు.
కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్ తీసిన వైద్యులు, అతని కడుపులో పేరుకుపోయిన వస్తువులను చూసి షాక్కు గురయ్యారు.