రోడ్డు ప్రమాదం.. హోంమంత్రి అనిత కారును ఆపి ఏం చేశారంటే? (video)

సెల్వి

సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (14:38 IST)
Anitha
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సహాయం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఒక యువతి గాయపడింది.
 
అదే సమయంలో, శ్రీశైలంకు వెళుతూ అనిత అదే మార్గంలో ప్రయాణిస్తుండగా, ప్రమాదాన్ని గమనించిన ఆమె తన కాన్వాయ్‌ను ఆపి గాయపడిన మహిళకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. గాయపడిన మహిళకు తాగునీరు అందించింది, భరోసా ఇచ్చారు. 
 
ఆ తర్వాత ఆ మహిళను మరొక వాహనంలో ఆసుపత్రికి తరలించి శ్రీశైలంకు తిరిగి ప్రయాణం కొనసాగించారు అనిత. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంత్రిని ప్రశంసిస్తున్నారు. 

ఆపద అంటే క్షణం ఆగదు అమ్మతనం
మానవత్వానికి మరోరూపం ఆమె దయాగుణం
అందుకే అనితమ్మకు అందుతోంది జన నీరాజనం#RoadAccident #VangalapudiAnitha #HomeMinisterAnitha #Humanity #Narasaraopeta #AndhraPradesh #SrisailamTour pic.twitter.com/YBSQgIR6BB

— Anitha Vangalapudi (@Anitha_TDP) February 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు