మొన్నేమో బిర్యానీలో గొంగలి పురుగు.. నిన్నేమో చాక్లెట్‌ కేక్‌లో బొద్దింక

గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:12 IST)
హైదరాబాద్ నగరంలోని ఐకియా రెస్టారెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగలి పురుగు బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా ఇదే ఐకియా రెస్టారెంట్లో చాక్లెట్ కేక్ ఆర్డర్ చేస్తే బొద్దింక పాకుతూ కనిపించింది. ఓ కస్టమర్‌ ఐకియాలోని రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ చాక్లెట్ కేస్ ఆర్డర్ చేశాడు. అందులో బొద్దింక కనిపించింది. వెంటనే దానిని ఫోటో తీసి ఆ కస్టమర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఐకియా స్టోర్‌కి చేరుకొని పరీక్షలు చేశారు. ఆ చాక్లెట్ కేకు సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించారు.
 
అంతేకాకుండా సంస్థకి రూ.5వేల జరిమానా కూడా విధించారు. శాంపిల్స్‌ని పరిశీలించి కంపెనీపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఐకియా స్టార్ ప్రారంభించిన రెండు నెలల్లోపే ఫుడ్ క్వాలిటీ లేదని వార్తల్లో నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు