ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

సెల్వి

మంగళవారం, 8 జులై 2025 (09:01 IST)
ఏపీలో కామాంధులు రెచ్చిపోయారు. మైనర్ బాలికను కామాంధులు రేప్ చేశారు. తాగిన మైకంలో గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. వద్దంటూ ఎంత వేడుకున్నా ఆ తాగుబోతులకు చెవులు వినిపించలేదు. అంతేగాకుండా ఈ అకృత్యానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలిక గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లింది. అదే సమయంలో అక్కడ నలుగురు యువకులు మద్యం సేవిస్తుండగా.. ఆ చిన్నారి వారి కంటపడింది. దీంతో ఆ యువకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు.

ఆపై ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కడప రిమ్స్ కు తరలించారు. అదే సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో వేంపల్లి పీఎస్‌పై దాడికి దిగారు. సకాలంలో పోలీసులు స్పందించలేదంటూ ఆరోపణలు రావడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు