కాగా, ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోక్సభ్యుడైన మిథున్ రెడ్డికి కోర్టును ఆశ్రయించగా ఆయనకు షరతులతో కూడిన అనుమతిని కోర్టు ఇచ్చింది. ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత సెప్టెంబరు 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో తిరిగి ఆయన కోర్టులో లొంగిపోయారు.
మరోవైపు, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ విశాంత అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్కు ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.
అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వలేదు. పైగా, ఆయనకు చెందిన నగలు, ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.