ఇంట్లో భార్య.. మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు...

గురువారం, 23 ఆగస్టు 2018 (09:34 IST)
పక్క గదిలో భార్య ఉండగానే మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు కొనసాగిసాంచాడో ప్రబుద్ధుడు. ఈ విషయం తెలుసిన ఇరుగుపొరుగువారు ఆయన్నుపట్టుకుని చితక్కొట్టారు. ఈ ప్రబుద్ధుడు పేరు శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
వేములవాడ పట్టణానికి చెందిన హన్మండ్ల శ్రీనివాస్‌ అదే మండలంలోని చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన 20 ఏళ్ల క్రితం ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పద్మను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. పద్మ కూడా ఎదురుగట్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, గత 4నెలలుగా శ్రీనివాస్‌ సమయానికి ఇంటికి రాకపోవడం, తరుచూ గొడవలకు దిగడంతో భర్త ప్రవర్తనపై పద్మకు అనుమానం కలిగింది. బంధువుల సహకారంతో శ్రీనివాస్‌ దిన చర్యపై ఆరా తీసింది. దీంతో సిరిసిల్ల పట్టణం సర్ధార్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ వేములవాడకు చెందిన మరో మహిళతోని సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుంది. ఆ తర్వాత ఆ మహిళను తన ఇంటికి కూడా తీసుకొచ్చి భార్య ఎదుటే రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం బక్రీద్‌ సెలవు అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ మహిళా సంఘాలతో కలిసి సిరిసిల్లకు వచ్చింది. అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడి శ్రీనివాస్‌, సదరు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేసింది. దీంతో సదరు మహిళ శ్రీనివాస్‌ తనను వివాహం చేసుకున్నాడని పద్మతో వాగ్వాదానికి దిగడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి కి చేరుకొని శ్రీనివాస్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు