భర్త మర్మాంగాన్ని కోసేసి హతమార్చిన భార్య.. కారణం ఏమిటంటే?

శుక్రవారం, 5 జూన్ 2020 (11:53 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో మహిళలు సహనం కోల్పోతున్నారు. నిన్న రాజస్థాన్‌లో నిండు గర్భిణి భర్తను హతమార్చింది. తన మైనర్ చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడిన భర్తను కొడవలితో నరికి చంపేసింది. 
 
ఇదే తరహా ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో కఠారి అప్పారావు అనే వ్యక్తి భార్య బుధవారం రాత్రి హత్య చేసింది. కఠారి అప్పారావు తెలంగాణకు చెందిన లక్ష్మిని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. 
 
అప్పారావు లక్ష్మి ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. ఇద్దరూ మద్యం తాగి తరచు గొడవ పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను భార్య తాళ్లతో మంచానికి కట్టేసి మర్మాంగాన్ని కోసేసి హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు