చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఈ నెల 23వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్లో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్లు తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్లో ఎంతో కీలకం.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు, పరుగులు, వికెట్లు, అత్యధిక స్కోరు, గెలుపోటములు వంటి వివరాలు గురించి తెలుసుకుందాం. భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 135 వన్డేలు జరిగాయి పాకిస్థాన్ 73 మ్యాచ్లలో విజయం సాధించింది.