ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18 సీజన్ పోటీలు అదిరిపోనున్నాయి. మరో ఐదు రోజుల్లో ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ఈ 18వ సీజన్ ప్రారంభంకానుండగా, తొలి ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు ఈ మ్యాచ్ వేదికకానుంది.
కాగా, ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ ప్రారంభోత్సవం కళ్లు చెదిరేలా నిర్వహించనున్నారు. బాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ తమ హై ఎనర్జీ డ్యాన్స్, ఫెర్ఫార్మెన్స్తో అదరగొట్టనున్నారు. ప్రముఖ గాయకులు అరిజత్ సింగ్, శ్రేయా ఘోషల్ కూడా తమ గానామృతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. కాగా, రెండు నెలల సాగనున్న ఐపీఎల్ పోటీలు మే 25వ తేదీన జరిగే ఫైనల్తో ముగియనున్నాయి.