ఉక్రెయిన్ దేశంలో యుద్ధానికి రష్యా బ్రేక్, ఎందుకని?

శనివారం, 5 మార్చి 2022 (13:04 IST)
ఉక్రెయిన్ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 11:30 గంటలకు యుద్ధానికి విరామాన్ని ప్రకటించింది. ఐదున్నర గంటల పాటు ఈ యుద్ధ విరామం వుంటుందనీ, ఆ తర్వాత తిరిగి యధావిధిగా యుద్ధం ప్రారంభమవుతుందని తెలిపింది.

 
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అభ్యర్థన మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను తరలించేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. యుద్ధంలో తిండినీళ్లు లేక అలమటిస్తున్న పౌరుల కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రష్యా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు