దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (19:49 IST)
హరియాణా జింద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది యువకులు మరణించారు. హిస్సార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిస్సార్లో జరుగుతున్న నియామకాల్లో పాల్గొన్న యువకులు శారీరక, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సమాచారం. అనంతరం ఓ ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమయంలో హాన్సీ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ సహా 10 మంది అక్కడిక్కడే మరణించారు.

మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారిలో ముగ్గురుని పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఆనవాళ్ల కోసం సమీప గ్రామాలకు సమాచారం అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు