అంజలీ సింగ్‌పై అత్యాచారం జరగలేదు.. శవపరీక్షలో తేలింది..

మంగళవారం, 3 జనవరి 2023 (20:12 IST)
Anjali Singh
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతి కారు ప్రమాదానికి గురైన ఘటన సంచలం రేపింది. ఢిల్లీ మీదుగా 12 కిలోమీటర్ల మేర ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో అంజలిపై అత్యాచారం జరగలేదని శవపరీక్ష నివేదిక పేర్కొంది. 
 
మరోవైపు, విషాదం జరిగినప్పుడు అంజలి, ఆమె స్నేహితురాలు నిధి ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా స్నేహితురాలు నిధిని పోలీసులు ప్రశ్నించారు. 
 
వాహనం అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు ఆమె అక్కడే ఉందని పోలీసులు తెలిపారు. కారు ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్నేహితురాలు నిధి భయంతో సంఘటనా స్థలం నుండి పారిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. కారులో ఉన్న నిందితుడు ఈవెంట్‌కు ముందు మద్యం సేవించినట్లు అంగీకరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు