అభినందన్ తిరిగొచ్చాడని మిఠాయిలు తీసుకుని వెళితే... అది బైటపడింది...

సోమవారం, 4 మార్చి 2019 (18:48 IST)
అభినందన్ తిరిగొచ్చాడన్న ఆనందంతో హాస్టల్‌కి మిఠాయిలు తీసుకువెళ్లిన ప్రిన్సిపల్‌కి దారుణం వెలుగు చూసింది. తన భర్త కోసం బాలికలను పంపిస్తున్న వార్డెన్ తీరు బయటపడింది. బాలికల బాగోగులు చూసుకోమని నియమించిన వార్డెన్ ఇలా చేయడం శోచనీయం. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ దారుణం జరిగింది. 
 
అల్వార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. నీల్ కమల్ అనే మహిళ హాస్టల్ వార్డెన్‌గా ఉంది. పాకిస్తాన్ కస్టడీ నుండి అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగొచ్చాడన్న సంతోషంతో పాఠశాల ప్రిన్సిపల్ మిఠాయిలు పంచడానికి వెళ్లాడు. విద్యార్థినులు అక్కడ వాళ్ల గోడును వెళ్లబోసుకున్నారు. 
 
వార్డెన్ వాళ్లని తన భర్త వద్దకు పంపిస్తోందని, అతను తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అసలు విషయం చెప్పారు. దాంతో ఖంగుతిన్న ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాస్టల్ వార్డెన్ నీల్ కమల్, అతని భర్త రమేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. నీల్ కమల్‌ను బాధ్యత నుండి సస్పెండ్ చేశారు. వెంటనే జైపూర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు