మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మంగళవారం, 5 డిశెంబరు 2017 (19:28 IST)
మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, స్నేహితులు కొట్టి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా కుమారపాళెంకు చెందిన నాగరాజ్... అదే ప్రాంతానికి చెందిన కామరాజ్ సతీమణి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఈ వీడియోను కామరాజ్ భార్య వద్దే చూపించి.. తనతో గడపాలని లేకుంటే ఈ వీడియోను వాట్సాప్‌లో అప్ లోడ్ చేసేస్తానని బెదిరించాడు.
 
దీంతో షాకైన బాధితురాలు.. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది. తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీయడమే కాకుండా.. దాన్ని చూపి బెదిరించిన నాగరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా నాగరాజ్ ఫోనులో వున్న వీడియోను తొలగించాలని.. మెమరీ కార్డ్ ఇచ్చేయాలని అడిగాడు. కానీ నాగరాజ్ ఇవ్వకపోవడంతో స్నేహితులతో కలిసి అతనితో కామరాజ్ గొడవకు దిగాడు. 
 
ఈ గొడవలో నాగరాజ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో స్పృహతప్పి కిందపడిపోయిన నాగరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై నాగరాజ్ సతీమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామరాజ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు