ముందు అభిషేక్ బెనర్జీ సంగతి చూడాడండి.. తర్వాత నా గురించి ఆలోచించండి..

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:26 IST)
కేంద్ర హో మంత్రి అమిత్ షాకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్ర శాసనసభకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ నేతలు, మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
తాజాగా మమతా బెనర్జీ కేంద్రం హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, తొలుత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని... ఆ తర్వాత తన గురించి ఆలోచించాలంటూ ఆయనకు సవాల్ విసిరారు. రాత్రింబవళ్లు వారు తన గురించి, తన మేనల్లుడి గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  
 
మమత వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని... తన మేనల్లుడిని సీఎంను చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాపై దీదీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల రికార్డులన్నింటినీ ఈసారి టీఎంసీ బద్దలు కొడుతుందని అన్నారు. అత్యధిక ఓట్లు, సీట్లను సాధిస్తామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు