రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను గత కొద్దిరోజులుగా హైదరాబాద్ శివార్లో బూత్ బంగ్లాలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరిస్తున్నారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్ ఈ కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మూడు జట్లుగా క్రికెట్ మ్యాచ్ లు పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.