బ్రైడన్ కార్స్ వేసిన 61వ ఓవర్లో మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన పంత్.. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే వికెట్ కీపర్ ఈ ఘనత సాధించలేదు. ఈ రికార్డు సాధించిన వారి జాబితాలో రిషభ్ పంత్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ(778), రాడ్ మార్ష్(773), జాన్ వైట్(684), ఇయాన్ హీలీ(624) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.