పెంపుడు కుక్క గోళ్లు గీరుకుని ర్యాబిస్ వ్యాధితో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

ఐవీఆర్

మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (22:18 IST)
అహ్మదాబాద్‌లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ తన పెంపుడు కుక్క గోళ్లు గీరుకుని గాయం చేయడంతో ప్రాణాలు కోల్పోయిన కేసు వెలుగులోకి వచ్చింది. అతనికి రేబిస్ వచ్చి ఐదు రోజుల చికిత్స తర్వాత మరణించాడు. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, అతనికి కుక్క కాటు వల్ల రేబిస్ రాలేదు కానీ తన పెంపుడు కుక్క గోళ్లను కత్తిరిస్తుండగా, ఆ కుక్క గోళ్లు గీరుకుని, దాని వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన అధికారి పేరు వనరాజ్ మంజరియా, ఆయన అహ్మదాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
 
మరణించిన ఇన్‌స్పెక్టర్‌కు జర్మన్ షెపర్డ్ కుక్క ఉంది, దాని గోళ్లను అతడు కత్తిరిస్తుండగా పొరబాటున అవి అతడి చేతికి గీరుకున్నాయి. అతను తన కుక్కకు అన్ని రకాల టీకాలు ఇచ్చాడు, దాంతో కుక్క గోళ్లు గీరుకున్నప్పటికీ, ఆయన దానిని తేలికగా తీసుకున్నాడు. కుక్క తనను కరవలేదని, గోళ్లు మాత్రమే గీరుకున్నాయని అనుకున్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు.
 

Deeply saddened by the demise of Police Inspector Sri V. S. Manjhariya. On behalf of the entire Gujarat Police parivaar, I extend my deepest condolences to his family. Om Shanti. pic.twitter.com/GcjE7AOi2y

— DGP Gujarat (@dgpgujarat) September 23, 2025
అయితే, ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి, అతనికి రేబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభించినప్పుడు, అతని కుటుంబం అతన్ని నగరంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన కెడి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అతనికి ఐదు రోజులు చికిత్స అందించారు కానీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అతన్ని కాపాడలేకపోయారు. ఆదివారం రాత్రి అతని ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. సోమవారం ఉదయం అతను మరణించాడు. సిన్సియర్ పోలీసు అధికారి మరణంతో మొత్తం పోలీసు శాఖ దుఃఖంలో మునిగిపోయింది.
 
మృతి చెందిన ఇన్‌స్పెక్టర్ అమ్రేలి జిల్లాకు చెందినవాడు. అతను సుమారు 24 సంవత్సరాల క్రితం 2001లో పోలీసు శాఖలో ఎస్.ఐగా చేరాడు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో అడ్మినిస్ట్రేటివ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు