ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ యంత్రాంగం కూడా సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులోభాగంగా, టిక్కెట్ల జారీని ఆన్లైన్, వాట్సాప్లలో కూడా జారీ చేస్తుంది. అయితే, కొందరు కండక్టర్లు వాట్సాప్లో వచ్చే టిక్కెట్లను అనుమతించడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు కీలక ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను.. వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది.
అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే.. ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సప్ నంబరుకు టికెట్ వస్తుంది.