ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

సెల్వి

గురువారం, 19 జూన్ 2025 (14:08 IST)
ప్రకాశంలో జిల్లాలో దారుణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో కారుతో ఈడ్చుకెళ్లి, మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 
 
అతడి మృతదేహం బస్టాండ్‌లో కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అతడి మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా మరణానికి ముందు రాజశేఖర్‌ని ఒక వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లినట్లు ఆనవాలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు